కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ-జనసేన అభ్యర్థిగా ఉన్న కాళ్ల నారాయణరావుపై వైసీపీ గూండాలు దాడికి పాల్పడ్డారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో తన డివిజన్ లో పారిశుద్ధ్య పనులు సరిగా జరగకపోవడంతో ఆయన స్వచ్ఛందంగా పనులు చేయిస్తున్నారని పవన్ వెల్లడించారు.
ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు వలంటీర్ల ద్వారా ఆయనను అడ్డుకొని కత్తులతో నారాయణరావుపై దాడి చేశారని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ సమగ్ర విచారణ చేపట్టాలని పవన్ డిమాండ్ చేశారు. హత్యాయత్నానికి పాల్పడిన వారిపై విజయనగరం జిల్లా ఎస్పీ తక్షణమే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
భావితరాల సంక్షేమం కోసం జగన్ కృషి: మంత్రి బొత్స