ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలల్లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. ఇందులో భాగంగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా వైసీపీ నేత కాకాణి గోవర్థన్రెడ్డి మాట్లాడుతూ.. తప్పుడు హామీలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. ఏపీకి ఐటీ సంస్థలు వస్తున్నాయని నిరుద్యోగులను మోసం చేశారని కాకాణి పేర్కొన్నారు.
ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారని అన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనల ఖర్చు భారం ప్రజలపై పడిందని విమర్శించారు.ఆయన అనుభవంతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని కాకాణి దుయ్యబట్టారు.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ బుజ్జగింపు రాజకీయాలు: అమిత్షా