జేడీ ఎస్- కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి కాలం చెల్లబోతోందంటూ జ ప్రసారమైన మీడియా కథనాల పై ర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అనుమానాలు రేకెత్తించమని ఎవరు చెబుతున్నారని మండిపడ్డారు. మీ వెనుక ఎవరున్నారో చెప్పాలంటూ నిలదీశారు. నేడు ఆయన మాట్లాడుతూ రాజకీయ నాయకుల గురించి ఏమనుకుంటున్నారంటూ మండిపడ్డారు.
ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన కథనాలను చూస్తే తనకు నిద్ర కూడా పట్టదేమో అని వ్యాఖ్యానించారు. ఏది పడితే అది రాసేందుకు ఎవరు అధికారం ఇచ్చారంటూ కుమారస్వామి ధ్వజమెత్తారు. అసలు ఇలాంటి కథనాలన్నింటినీ చూస్తుంటే వాటిని నియంత్రించేందుకు ఓ చట్టం తీసుకురావలనిపిస్తోందన్నారు. తాను ఏ మాత్రం మీడియాకు భయపడనని తేల్చి చెప్పారు.