telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి

Kodandaram

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీ.జే.ఎస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని టి.జే.ఎస్ అధ్యక్షుడు ఖమ్మం,నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కోదండరాం కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం భవన్ లో కోదండరాం ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోయిన ఆరు సంవత్సరాల లో ఓపెన్ కాస్ట్ లకు వ్యతిరేకంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని.. ఇప్పటికే భూపాలపల్లి లో గల ఓపెన్ కాస్ట్ లను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఫైర్‌ అయ్యారు. ఓపెన్ కాస్ట్ ల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఓపెన్ కాస్ట్ ల వల్ల జరిగే నష్టాన్ని గురించి ప్రభుత్వానికి నివేదిస్తమని తెలిపారు. అవసరమైతే గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళతామని…. సింగరేణి ప్రైవేటీకరణ ను నిలువరించడానికి…అలాగే ఉపాధి కల్పనను పెంచుకోవడానికి ఈ ఎన్నిక కీలకం కానుందని పేర్కొన్నారు. పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం కానుందని… ఇంత కాలం కొనసాగిస్తున్న ఉద్యమానికి ఈ ఎన్నిక కీలకం కానుందని తెలిపారు. కార్య చరణను బలంగా ముందుకు తీసుకు వెళ్ళడానికి సింగరేణి అంశంపై బలమైన ఎజెండా కోసం జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీ.జే.ఎస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.

Related posts