telugu navyamedia
రాజకీయ వార్తలు

గంటా అనుచరుడు నలంద కిశోర్ మృతి

kishore prashanth

ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్‌ మృతి చెందారు. ఆయన సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని మూడు వారాల క్రితం కర్నూలు సీఐడీ పోలీసులు అర్ధరాత్రి సమయంలో అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం నుంచి నేరుగా కర్నూలుకు రోడ్డు మార్గంలో తరలించి అక్కడ న్యాయస్థానంలో హాజరు పరిచారు. అనంతరం ఆయనను విచారించి తిరిగి వదిలేశారు.

అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగోలేదని ఆయన బంధువులు అంటున్నారు. అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన… చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారని వారు తెలిపారు. ఐదు రోజులుగా జ్వరంతో బాధపడ్డారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నలంద కిశోర్ మృతిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Related posts