telugu navyamedia
క్రీడలు వార్తలు

ఇంగ్లాండ్ భారత పర్యటన షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ…

ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు ముందు వన్డే సిరీస్ ను కోల్పోయి తర్వాత టీ 20 సిరీస్ గెలిచింది. ఇక ఈ రెండు జట్లు త్వరలో ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే ఈ పర్యటన అనంతరం భారత్ కు తిరిగి వచ్చే టీం ఇండియా ఇంగ్లాండ్ తో తలపడనుంది. అయితే ఇంగ్లాండ్ భారత పర్యటనలో జరగనున్న మ్యాచ్ ల షెడ్యూల్ ను తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 5న ప్రారంభం కానున్న నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో … మొదటి, రెండో టెస్టుకు చెన్నై ఆతిథ్యం ఇవ్వగా, అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన మోతెర స్టేడియం మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ నాలుగు టెస్ట్ మ్యాచ్ లలో డే-నైట్ టెస్ట్ మార్చి 4న చివరకు ప్రారంభం అవుతుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ తర్వాత అక్కడే అహ్మదాబాద్‌లోనే మార్చి 12న 5 మ్యాచ్ ల టీ 20 సిరీస్ జరుగుతుంది. అలాగే చివరకు పూణే వేదికగా మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ మార్చి 23న ఆరంభమవుతుంది. చూడాలి మరి ఈ మూడు ఫార్మటు ల సిరీస్ లో ఎవరు పై చేయి సాధిస్తారు అనేది.

Related posts