రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఏపీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలోని డోకిపర్రులో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం నాటే ప్రతి మొక్క భావి తరాలకు ఫలాలను అందిస్తుందని, ప్రాణ వాయువును అందిస్తుందని చెప్పారు.
“అశోకుడు దారికి ఇరువైపులా చెట్లు నాటించెను” అని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నామనిగుర్తుచేశారు. ఆయన నాటించిన చెట్లు ఆ తర్వాత తరాలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు. అడవులను నరికేయడం వల్ల భూతాపం పెరిగిందన్నారు. ఫలితంగా మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని అన్నారు. రాష్ట్రంలో 23 శాతం అడవులు మాత్రమే ఉన్నాయని, 33 శాతంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.
ఓటమిని ఒప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదు…