telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్‌ విజ్ఞప్తితోనే ఏపీలో కియా ప్లాంట్: బుగ్గన

Mla buggana,data leake

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన చేసిన విదేశీ పర్యటనలపై వైసీపీ విమర్శలు గుప్పించింది. ఏ రాష్ట్ర సీఎం కూడా చంద్రబాబు మాదిరిగా విదేశీ పర్యటనలు చేయలేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు విదేశీ పర్యటనల వల్ల ఏ ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదన్నారు.

నాడు వైఎస్‌ విజ్ఞప్తితోనే ఏపీలో కియా ప్లాంట్ నెలకొల్పబడిందని ఆయన చెప్పారు. సీఎం జగన్‌కు కియా సీఈవో లేఖ రాశారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్లాంట్‌ పెట్టాలని 2007లో వైఎస్‌ తమను కోరినట్లు, దేశంలో ప్లాంట్‌ పెడితే ఏపీలో పెడతామని ఆనాడే చెప్పినట్లు జగన్‌కు కియా సీఈవో లేఖ రాశారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

Related posts