telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

‌ఉచిత విద్యుత్ రైతులు పోరాడి సాధించుకున్న హక్కు: చ‌ంద్ర‌బాబు

chandrababu tdp ap

వ్యవసాయ విద్యుత్తుకు నగదు బదిలీ పథకం పేరిట మీటర్లు బిగిస్తున్నారని టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైసీపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు రైతులను క‌ష్టాల పాలు చేసేలా ఉన్నాయ‌ని విమ‌ర్శించారు. ‌ఉచిత విద్యుత్ అనేది‌ రైతులు పోరాడి సాధించుకున్న హక్కు అని చెప్పారు. దాన్ని యథాతథంగా పునరుద్ధరించాలని అన్నారు.

ప్రభుత్వం జీవో 22ను ఉపసంహరించుకోవాలని ఆయ‌న చెప్పారు. రాయ‌ల‌సీమ, మెట్ట ప్రాంతాల‌ రైతుల మనోభావాలు దెబ్బతీసేలా ప్ర‌భుత్వ నిర్ణయం ఉంద‌ని చంద్ర‌బాబు తెలిపారు. అప్పులు చేయడమే ప్రాధాన్యతగా వైసీపీ స‌ర్కారు చ‌ర్య‌లు ఉన్నాయ‌ని దుయ్యబట్టారు. ప్రజలపై గంటకు రూ.9 కోట్ల అప్పు మోపుతున్నారని ఆయ‌న తెలిపారు. జగన్ కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌‌ బానిస కాదని చ‌ంద్ర‌బాబు అన్నారు.

Related posts