telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

భర్త చేసిన పనికి బలైన కవలలు… భార్య ఏమంటోందంటే ?

Twins

న్యూయార్క్‌కు చెందిన ఓ మెడికల్ సెంటర్‌లో పని చేస్తున్నాడు జువాన్ రోడ్రిగెజ్. భార్య మరిస్సాను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. గత జూలైలో వారికి ఇద్దరు కవలలు జన్మించారు. ఎప్పట్లాగే శుక్రవారం ఆఫీసుకు బయలుదేరిన జువాన్‌ను మరిస్సా ఆపింది. పిల్లలను డేకేర్ సెంటర్లో వదిలి, ఆఫీసుకు వెళ్లమంది. సరేనన్న జువాన్ పిల్లలను కారులో వెనుకసీట్లో పడుకోబెట్టాడు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో చిరాగ్గా డ్రైవ్ చేస్తూ ఆఫీసుకు వెళ్లిపోయాడు. పిల్లల విషయం మర్చిపోయాడు. కారులోని వేడికి ఉడికిపోయిన ఆ కవలలు ఇద్దరూ మరణించారు. సాయంత్రం ఇంటికి బయలుదేరినపుడు కారు వెనుక సీట్లో చలనం లేని పిల్లల్ని చూసిన జువాన్ గుండె ఆగినంతపనైంది. హడావిడిగా పిల్లిద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే వారిద్దరూ మరణించారని, వారి శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీలుందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు జువాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను డేకేర్ సెంటర్లో వదిలేశానని అనుకున్నానని, వారి గురించి మర్చిపోయానని జువాన్ కోర్టు హాల్లో కుళ్లికుళ్లి ఏడ్చాడు. అతని బాధ చూసిన భార్య మరిస్సా.. భర్తను క్షమించాలని కోర్టుకు అర్జీ పెట్టుకుంది. పిల్లల్ని జువాన్ చాలా ప్రేమగా చూసుకునేవాడని, వారు చనిపోవడం తమకు చాలా ఘోరమైన షాకని ఏడ్చింది.

Related posts