telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అన్ని ప్రాంతాలకు పులివెందుల గ్యాంగులు: బుచ్చయ్య చౌదరి

gorantla buchayya on resignation

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో పులివెందుల రాజ్యంగా మారిపోయిందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. పులివెందుల గ్యాంగులు రాష్ట్రమంతటా విస్తరించాయని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీయే కొనసాగుతోందని, ఇప్పుడు కూడా రాజధాని పేరుతో కొత్త రకం దోపిడీకి తెరలేపుతున్నారని ఆరోపించారు.

బాధ్యతగా మాట్లాడాల్సిన వైసీపీ మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. మూడు రాజధానులంటూ రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు నెలకొనేలా చిచ్చు పెట్టడమేకాక, నిరసన గళం వినిపిస్తున్న అమరావతి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Related posts