నందమూరి నటసింహాం హీరో బాలకృష్ణ హోస్ట్గా ఆహా ఓటీటీ వేదీకగా అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే షో ప్రసారమవుతోన్న’అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షోతో అభిమానుల్ని అలరిస్తున్నారు. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో విజయవంతంగా ముందుకు వెళుతుంది. ఇప్పటివరకు 9ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు గ్రాండ్ ఫినాలేలోకి అడుగుపెట్టింది.
ఇప్పటికే మోహన్ బాబు, నాని, అనిల్ రావిపూడి, బ్రహ్మానందం, రవితేజ, రాజమౌళి, ‘లైగర్’ టీమ్, ‘పుష్ప’ టీమ్ ఇలా చాలా మంది స్టార్లు వచ్చారు. తాజాగా సూపర్స్టార్ మహేశ్బాబు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
ఈ ప్రమో మొదట్లో… ‘ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతుందో అతనే మహేశ్’.. అంటూ బాలయ్య తనదైన స్టయిల్లో మహేశ్ను ఆహ్వానించారు. ఇక తన కుమారుడు గౌతమ్ క్యాట్, సితార బ్రాట్ ..తాట తీసేస్తది అంటూ మహేశ్ నవ్వులు పూయించాడు.
మహేష్ బాబు ఎంతో మంది చిన్నారుల ఆరోగ్యానికి అవసరమయ్యే ఖర్చులను భరిస్తూ సేవ అందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే మహేష్ సేవ కార్యక్రమాలను ప్రారంభించడానికి గల కారణాన్ని ఈ షోలో ఆసక్తికర విషయాలు తెలిపారు.
ఆయన ఆపరేషన్ చేయించిన ఓ పిల్లాడి ఫ్యామిలీను స్టేజ్ పైకి పిలిచారు బాలయ్య. మహేష్ బాబుని చూసిన వారు ఎమోషనల్ అయ్యారు. తమ బిడ్డను కాపాడినందుకు మహేష్ కి కృతజ్ఞతలు చెప్పారు. అదే సమయంలో తనకు అసలు ఈ ఆలోచన ఎలా పుట్టిందో చెప్పుకొచ్చారు మహేష్.
మహేష్ తనయుడు గౌతమ్ ఆరు వారాల ముందు జన్మించాడని, ఆ సమయంలో గౌతమ్ కేవలం అరచేతంత సైజ్లో ఉన్నాడని తెలిపారు అయితే తమ వద్ద డబ్బు ఉంది కాబట్టి మాకు సరిపోయింది.. కానీ చాలా మందికి ఆ అవకాశం ఉండదు, కాబట్టి వారికి సేవ చేయాలనుకొని అప్పటి నుంచి ఈ మార్గంలో అడుగుపెట్టానని చెప్పుకొచ్చారు మహేష్.
భరత్ అనే నేను’ సినిమా షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న ఓ సంఘటనను బాలకృష్ణతో షేర్ చేసుకున్నారు. సీరియస్ గా డైలాగ్స్ చెబుతుంటే.. ఓ లేడీ మాత్రం గేమ్ ఆడుకుంటుందని.. ఆమె వైపు చూసి ఆపండమ్మా అని చెప్పానని.. మీరు గనుక ఉంటే మైక్ విసిరేసేవాళ్లు అంటూ బాలయ్యతో అన్నారు మహేష్.
అంతేకాకుండా హైదరాబాద్ కేబీఆర్ పార్కులో తనకు ఎదురైన అనుభవాన్ని కూడా పంచుకున్నారు మహేష్. పార్కులో వాకింగ్కు వెళ్లిన సమయంలో పాము కనిపించడంతో మరోసారి అటువైపు వెళ్లలేదని నవ్వుతూ చెప్పుకొచ్చారు ప్రిన్స్. అన్స్టాపబుల్ తొలి సీజన్ చివరి ఎపిసోడ్ ఇలా ఫన్నీ ఫన్నీగా సాగింది.
కాగా..మహేశ్ నటించిన ‘సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. బ్యాంక్ రుణాల ఎగవేత నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్గా చేస్తోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.