telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా మహమ్మారిపై దేశ ప్రజలకు శుభవార్త

భారతీయ రక్షణ సంస్థ DRDO తయారుచేసిన కరోనా మందు 2DG పౌడర్ ను వచ్చే వారం విడుదల చేస్తోంది. మొదటి విడతగా 10000 డోసులు విడుదల అవుతున్నాయి. తొందరలోనే డాక్టర్ రెడ్డి లాబ్ సహ కారంతో ఈ మందు మన హైదరాబాదులో బృహత్తర మోతాదులో తయారవబోతుంది. ఈ 2DG మందు ‘మోసగాడ్ని మోసం చేయటం’ అనే సూత్రంతో పని చేస్తుంది. ఏ వైరస్ అయినా మానవ శరీరంలోని కణాలతో కలిసి వాటిని మోసం చేసి వాటి నుంచి ప్రోటీన్ వాడుకుని పదంతలవుతుంది. ఇలా వైరస్ పెరగటానికి శరీరం నుంచి గ్లూకోస్ కణాల అవసరం వైరస్ కు వుంటుంది. ఈ చక్కెర అణువుల నుంచి వైరస్ కి శక్తి వస్తుంది. ఆ శక్తితో మళ్ళీ పదింతలౌతుంది. ఇలా రక్తభీజునిలా పెరుగుతున్న వైరస్ కణాలతో మన రక్తంలోని తెల్లకణాలు ( యాంటీ బాడీస్) పోరాటం చేస్తాయి..

పెరిగే వైరస్ ఎక్కువై తెల్లరక్తకణాలు ఓడిపోయినప్పుడు మాత్రమే మనిషి మరణిస్తాడు. అయితే ఇప్పుడు ఈ తాజా మందు 2DG, కరోనా వైరస్ ను మోసం చేసి తననే గ్లూకోస్ అని వైరస్ భావించేలా చేస్తుంది. ఈ మందు (అణువులను) మింగిన వైరస్ లు వంద్యమై ఇంకా కొత్త వైరస్ లను పుట్టించలేక పోతాయి. ఈ సమయంలో తెల్లరక్తకణాలుఎదురు దాడి చేసి మిగిలిన వైరస్ లను నాశనం చేసేస్తాయి. ప్రస్తుత అంచనా ప్రకారం ఈ మందుతో కేవలం కొన్ని గంటలలోనే కరోనా వైరస్ జీరో అవుతుంది. ఈ మందు కనుక అనుకున్న విధంగా పని చేస్తే, కరోనా వైరస్ చిన్న జలుబు కంటే చిన్న జబ్బుగా మారి పోతుంది. ఇప్పటికే క్లినికల్ ట్రయల్సులో (మందు పరీక్షలో) ఇది అధ్బుతంగా పని చేసింది. చైనా వాడి దుష్టచేష్టలకు భారత రక్షణ శాస్త్రజ్ఞులు వాడిన బ్రహ్మాస్త్రమే ఈ 2DG మందు అని గొప్పగా చెబుతూన్నారు తెలిసిన డాక్టర్లు.

Related posts