telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతిపై రౌండ్‌టేబుల్‌ సమావేశం

chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ రాజధాని అమరావతిలో ఇటీవల పర్యటించిన సంగతి తెలిసిందే.  డిసెంబరు ఐదో తేదీన అమరావతిపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్‌ సెంటర్‌లో అన్నీ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వ్యాపార వాణిజ్య సంఘాలు, మేధావి వర్గానికి ప్రాతినిధ్యం వహించే సంఘాల ప్రతినిధులను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Related posts