టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ రాజధాని అమరావతిలో ఇటీవల పర్యటించిన సంగతి తెలిసిందే. డిసెంబరు ఐదో తేదీన అమరావతిపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్లో అన్నీ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశానికి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వ్యాపార వాణిజ్య సంఘాలు, మేధావి వర్గానికి ప్రాతినిధ్యం వహించే సంఘాల ప్రతినిధులను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఈమేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.