ఏపీ పోలీస్శాఖలో సిబ్బందికి వారాంతపు సెలవులను నేటి(బుధవారం) నుంచి అమలుచేస్తున్నట్టు శాంతిభద్రతల అడిషనల్ డీజీ డాక్టర్ రవిశంకర్ చెప్పారు. పోలీస్శాఖలో 30 విభాగాలు ఉన్నాయని, వాటిని అధ్యయనంచేసి 19 మోడళ్లను రూపొందించామని తెలిపారు. వీక్లీఆఫ్ నిర్వహణకు ప్రతి జిల్లాలో నోడల్ ఆఫీసర్గా ఎస్పీస్థాయి అధికారి బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. వారాంతపు సెలవులపై ప్రతినెల ఫీడ్బ్యా క్ తీసుకుంటామని చెప్పారు.
ఇప్పటికే విశాఖ, కడప జిల్లాల్లో ప్రయోగాత్మకంగా వీక్లీఆఫ్లు అమలుచేస్తున్నట్టు తెలిపారు. పని ఒత్తిడి కారణంగా 45 నుంచి 50 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న పోలీస్ సిబ్బందికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తమ పరిశీలనలో తేలిందని పేర్కొన్నారు. వారాంతపు సెలవు అమలుతో పోలీసులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.