telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రధాన మంత్రి గా .. కేజ్రీవాల్‌…

kejriwal as prime minister of india

కేజ్రీవాల్‌ భవిష్యత్‌లో ప్రధాన మంత్రి అవుతారని ఆశిస్తున్నానని ఓ వృద్ధురాలు పేర్కొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆప్‌ ఓ సభ నిర్వహించింది. ఈ సభకు ఓ పండు ముసలావిడ వచ్చింది. వేదికపై వెళ్లిన ఆ వృద్ధురాలు మాట్లాడుతూ.. అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎప్పట్నుంచో కలవాలి అనుకుంటున్నాను. ఆయనకు తన దీవెనలు ఇవ్వాలని కోరుకున్నాను. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ రాబోయే రోజుల్లో ప్రధాన మంత్రి అవుతారని ఆశిస్తున్నట్లు వృద్ధురాలు చెప్పింది.

మంచి పనులు చేసిన వారందరికీ అరవింద్‌ లాంటి కొడుకు లభిస్తాడని ఆమె అభిప్రాయపడింది. చివరగా కేజ్రీవాల్‌ జిందాబాద్‌ అంటూ వృద్ధురాలు నినదించింది. ఈ సందర్భంగా వృద్ధురాలికి సీఎం కేజ్రీవాల్‌ పాదాభివందనం చేశారు. వృద్ధురాలు మాట్లాడిన వీడియోను కేజ్రీవాల్‌ తన ట్విట్టర్‌ పేజీలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అయింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను 2020, జనవరి లేదా ఫిబ్రవరి నెలలో నిర్వహించే అవకాశం ఉంది.

Related posts