telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజలంతా తిరగబడితే వైసిపి తోక ముడవడం ఖాయం…

chandrababu

టీడీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… కరోనా వ్యాక్సిన్ పంపిణీ వంకతో స్థానిక ఎన్నికలు వాయిదా వేయించడానికి మరో జగన్నాటకానికి తెరలేపారని అన్నారు. రాజమండ్రి టిడిపి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, వైఎస్ జగన్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. డిసెంబర్ 25నుంచి కోటిమందికి వ్యాక్సిన్ పంపిణీ అంటూ దొంగ ట్వీట్లు పెడుతున్నారు. నిష్పాక్షికంగా స్థానిక ఎన్నికలు జరిగితే ఓటమి భయం వైసిపికి వెంటాడుతుంది. అందుకే వ్యాక్సిన్ పంపిణీ నాటకాన్ని తెరపైకి తెచ్చారు. స్థానిక ఎన్నికలకు టిడిపి నాయకులు, కార్యకర్తలు సిద్దంగా ఉండాలి. గతంలో వైసిపి దాడులు, దౌర్జన్యాలకు ప్రజలే తగిన బుద్ది చెప్పాలి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో టిడిపి గెలుపే వైసిపి దుర్మార్మాలకు అడ్డుకట్ట అని చంద్రబాబు ఆరోపించారు. బాధిత బిసి, ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటీలంతా ఏకమై వైసిపికి బుద్ది చెప్పాలి. జమిలి ఎన్నికలు ఎప్పుడొచ్చినా  టిడిపి శ్రేణులంతా సంసిద్దంగా ఉండాలి. వంద మందికి 5గురు మారితే వైసిపి ఇంటికే.. మంద మెజారిటి ఉందని విర్రవీగితే ప్రజలే బుద్ది చెబుతారు. బాధిత ప్రజలంతా ఏకమై తిరగబడితే వైసిపి తోక ముడవడం ఖాయం. వైసిపి బాధిత ప్రజానీకానికి టిడిపి శ్రేణులంతా అండగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts