telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కోడెల ఆత్మహత్య పై కూమార్తె విజయలక్ష్మి ఫిర్యాదు

case filed-kodela-daughter

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ప్రభుత్వం వేధింపుల వల్లే తన తండ్రి చనిపోయారని కోడెల కుమార్తె విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పొలిటికల్ రివేంజ్ కోసమే తన తండ్రి, అన్నపై కేసులు పెట్టారని విజయలక్ష్మి చెప్పారు.

గత కొద్దికాలంగా ఆయనపై ఏపీలో పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు అంటున్నారు. కోడెల ఆత్మహత్యపై అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కోడెల పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టులో ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు.

Related posts