telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

నిర్ణిత ఓవర్లలో .. వెస్టిండీస్ 95 పరుగులే .. స్వల్ప లక్ష్యంతో భారత్..

westindies scored only 95 in 20 overs

వెస్టిండీస్ సిరీస్ లో భాగంగా ఫ్లోరిడాలో భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో విండీస్ అత్యల్ప స్కోరు చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయిన ఆ జట్టు కేవలం 95 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో కిరన్ పొల్లార్డ్ (49 బంతుల్లో 49 పరుగులు, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మాత్రమే రాణించాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు.

భారత్ బౌలర్లలో నవ్‌దీప్ సైనీ 3 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేయగా, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు తీశాడు. అలాగే వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, క్రునాల్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు తలా 1 వికెట్ దక్కింది.

Related posts