telugu navyamedia
క్రీడలు వార్తలు

టెస్టులో ఆడటమే నా ప్రధాన లక్ష్యం : భువీ

ఇంగ్లండ్ ‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు స్టార్ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌. మ్యాచ్ అనంతరం భువీ మాట్లాడుతూ… ‘టెస్ట్ క్రికెట్‌ ఆడాలనుకుంటున్నా. సుదీర్ఘ ఫార్మాట్‌ను దృష్టిలో పెట్టుకొనే సన్నద్ధమవుతాను. టెస్టు మ్యాచులకు ఎలాంటి జట్టును ఎంపిక చేస్తారన్నది భిన్నమైన కథ’ అని భువీ బదులిచ్చాడు. ప్రస్తుతం టెస్టు క్రికెట్‌ ఆడటమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని టీమిండియా స్టార్ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ తెలిపాడు. జూన్‌, జూలైలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపికవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నానన్నాడు. పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉండేందుకు, గాయాల బారిన పడకుండా ఉండేందుకు తన తదుపరి కార్యచరణను రూపొందించుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. రాబోయే ఇంగ్లండ్‌ పర్యటనలో మేం ఎక్కువ క్రికెట్‌ ఆడాల్సి ఉంటుంది కాబట్టి ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తా’ అని భువీ వెల్లడించాడు. రెండేళ్లుగా భువీ గాయాలతో సతమతం అవుతున్నాడు. ఐపీఎల్‌లోనూ పూర్తి స్థాయిలో ఆడలేకపోతున్నాడు. గత సీజన్‌ను మధ్యలోనే వదిలేశాడు. ఎన్‌సీఏలో సుదీర్ఘ కాలం ఉండి ఫిట్‌నెస్‌ సాధించి ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీసులకు ఎంపికయ్యాడు.

Related posts