telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జవాన్ల కుటుంబాలకు కేటీఆర్‌ రూ.25 లక్షల విరాళం

KTR Tribute to CRPF Jawans  Hyderabad

ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జూబ్లీహిల్స్ సీఆర్‌పీఎఫ్ కార్యాలయంలో నివాళి అర్పించారు. ప్రజలను కాపాడే కర్తవ్యంలో మరణించిన వారికి తమ రాష్ట్ర ముఖ్యమంత్రి తరఫున నివాళి అర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. దాడిలో మరణించిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానూభూతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా అమర జవాన్ల కుటుంబాలకు తన వ్యక్తిగతంగా రూ.25 లక్షల విరాళం ఇస్తున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు.

తన స్నేహితులు మరో 25 లక్షలు ఇచ్చారని, మొత్తం 50 లక్షల రూపాయలను అమర జవాన్ల కుటుంబాలకు విరాళంగా కేటీఆర్‌ చెల్లించారు. ఈ మేరకు బంజారాహీల్స్‌లోని సీఆర్‌పీఎఫ్‌ సధరన్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఐజీపీ రాజుకు చెక్కును అందచేశారు. పుల్వామా ఉగ్రదాడి ఎంతగానో కలచివేసిందని కేటీఆర్ అన్నారు. కేవలం జవాన్ల వల్లే మనమంతా క్షేమంగా ఉన్నామని పేర్కొన్నారు.

Related posts