తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తన పెద్ద మనసును చాటుకున్నారు. మానవత దృక్పదంతో ఓ అనాథ అమ్మాయికి కన్యాదానం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి బహుదూర్పల్లిలోని గౌరీ అనాథ ఆశ్రమంలో పెరిగిన పుష్పకు విజయవాడకు చెందిన కిషోర్కు ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఈ వివాహానికి యువతి తల్లిదండ్రుల స్థానంలో వివాహ కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డి దంపతులు కన్యాదానం చేశారు.
అమ్మాయి పేరున రూ.235000 ఫిక్స్డిపాజిట్ పత్రాలను అందచేయడమేకాకుండా, రూ. 25వేల నగదును నూతన దంపతులకు మంత్రి అందజేశారు. వివాహానికి వచ్చిన పెద్దలకు, వివాహ ఖర్చు మొత్తం ఇచ్చి, కన్యాదానం చేసిన మంత్రి మల్లారెడ్డి దంపతులకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.