telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

జవాన్ల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా

పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రభుత్వం నుంచి ఒక్కో అమర జవాన్‌ కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున సహాయం ప్రకటిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉగ్రదాడి ఘటన బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 
ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరకుండా కేంద్ర, రాష్ట్రాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాలని సీఎం సూచించారు. అమరుల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. జవాన్ల కుటుంబాలకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

Related posts