కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్లోని పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు,ఆశా వర్కర్లకు కృతజ్ఞతలు తెలిపారు. వారికి వాటర్బాటిళ్లు, గ్లూకోజ్, శానిటైజర్లను పంపిణీ చేశారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీసులు వైద్యులు, వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని అన్నారు. వారి రుణం తీర్చుకోలేనిదని మంత్రి వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ సేవలందిస్తున్న సిబ్బందిని ఆయన ప్రశంసించారు. ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించాలని తెలిపారు. లాక్డౌన్ నేపధ్యంలో ఎవరూ అనవసరంగా బయటకు రావద్దని మంత్రి సూచించారు.