telugu navyamedia
రాజకీయ వార్తలు

కశ్మీర్ అమ్మాయిలకు లైన్ క్లియర్.. హరియాన సీఎం అనుచిత వ్యాఖ్యలు

Manohar Lal Khattar after returning from foreign trip

కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో హరియాన ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తమ మంత్రి ఓపీ ధన్‌ఖర్ బీహార్ నుంచి కోడళ్లను తీసుకొస్తానని చెప్పేవారని, ఇప్పుడు కశ్మీర్ నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చేందుకు లైన్ క్లియర్ అయిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై సీఎం స్పందిస్తూ.. యువతీ యువకుల మధ్య పరస్పర అంగీకారంతో ఇవి జరుగుతాయని గతంలో చెప్పారు.అయితే ఒకసారి వారి మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత తనపై అత్యాచారం జరిగిందంటూ అమ్మాయిలు కేసులు పెడతారని అన్నారు. దాదాపు 80-90 శాతం కేసుల్లో ఇదే జరుగుతుందని ఆయన గతంలో కూడా చేసిన వ్యాఖ్యలు చేశారు.  

Related posts