telugu navyamedia
రాజకీయ వార్తలు

శ్రీమంత్ పాటిల్ లేఖపై అనుమానాలు వ్యక్తం చేసిన కర్ణాటక స్పీకర్

Ramesh kumar speaker

కర్నాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్ష సందర్భంగా కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. కలిసి బయలుదేరిన తమ ఎమ్మెల్యేలు ఎనిమిది మందిలో ఒకరైన శ్రీమంత్ పాటిల్ ఆసుపత్రిలో చేరారని, మిగిలిన వారు కనిపించకుండా పోయారని కాంగ్రెస్ సభ్యుడు శివకుమార్ స్పీకర్ దృష్టికి తెచ్చారు. తమ ఎమ్మెల్యేలు కిడ్నాప్ అయ్యారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య తనకు రాసిన లేఖ గురించి కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ ప్రస్తావించారు.

ఈ కిడ్నాప్ ఈ వ్యవహారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీమంత్ పాటిల్ పేరుతో తనకు ఓ లేఖ వచ్చిందని చెప్పారు. ఆ లేఖలో తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతున్నానని, ఆసుపత్రిలో ఉన్నానని, అందుకే, అసెంబ్లీకి రాలేకపోతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నట్టు చెప్పారు. అయితే ఈ లేఖను లెటర్ హెడ్ పై రాయలేదని తేదీ కూడా వేయలేదని అన్నారు.ఈ లేఖను తాను నమ్మలేనని, దీనిపై తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. పాటిల్ గురించి ఆరా తీయాలని ఆదేశించారు.

Related posts