భారీ వర్షాలకు గుజరాత్ ప్రజలు అతలాకుతలమవుతున్నారు. పలు ప్రాంతాల్లో వరద నీరు పొంగి పొర్లుతుంది. ఈ క్రమంలో ఖేడా జిల్లాలోని ప్రగతి నగర్లో మూడు అంతస్తుల భవనం భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాలను తొలగిస్తున్నారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
previous post