ఈ నెల 14వ తేదీన కేబినెట్ ఎజెండాలో చేర్చే అంశాలపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ సమావేశం గురువారం నాడు జరిగింది.కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎంఓ నుండి ఏపీ సీఎస్కు నోట్ అందింది. ఫణి తుపాన్, కరువు, తాగునీటి సమస్యపై చర్చించనున్నట్టు ఆ నోట్లో సీఎంఓ తేల్చి చెప్పింది.
ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం విడి విడిగా సమావేశమయ్యారు.కేబినెట్ సమావేశానికి సంబంధించిన ఎజెండాను స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేయనుంది. స్క్రినింగ్ కమిటీ ఫైనల్ చేసిన ఎజెండా అంశాలను ఈసీ ముందుకు పంపనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.