సాంకేతిక కారణాల వల్ల ఆప్ఘనిస్థాన్లో ఓ మిలిటరీ హెలికాప్టర్ కుప్పకూలింది. పర్హా ప్రావిన్స్లోని పోర్చమాన్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. మిలిటరీకి సంబంధించి ఆయుధాలను హెలికాప్టర్లో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఆఫ్ఘన్ రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
సాంకేతిక కారణాల వల్లే ఎంఐ -35 హెలికాప్టర్ కుప్పకూలినట్లు రక్షణ శాఖ ధృవీకరించింది. ఇద్దరు పైలట్ల మృతిపై రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.అయితే సాంకేతిక లోపం వల్ల పాక్టియా ప్రావిన్స్లో కూడా మరో హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు రక్షణ శాఖ వెల్లడించింది.