ప్రపంచ వ్యాప్తంగా కరోన విజృంభిస్తోన్న నేపథ్యంలో చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అనుకూలమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డబ్ల్యూహెచ్వో చీఫ్, డైరెక్టర్ జనరల్ అధనామ్ ఘెబ్రేయేసస్ స్పందించారు. కొవిడ్-19 మహమ్మారితో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. తమ సంస్థ తమ బాధ్యతలను సమర్థవంతంగానే నిర్వర్తిస్తోందని తెలిపారు.
చైనాకు తాము అనుకూలంగా వ్యవహరిస్తున్నామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు. ఏ పక్షపాతమూ లేకుండా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. కరోనా గురించిన సమాచారాన్ని ప్రపంచానికి డబ్ల్యూహెచ్వో అందిస్తూనే ఉందన్నారు.అమెరికా నిధులు ఆపేయడానికి ఇది సరైన సమయం కాదని, వైరస్ విజృంభిస్తోన్న సమయంలో నిధుల కొరత సృష్టించడం సరికాదని చెప్పారు. తాము ప్రతి దేశాన్ని సమ దృష్టితోనే చూస్తున్నామని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతో వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు.
సీఎంపై టీడీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు: వైసీపీ