ఏపీ అసెంబ్లీ ఆవరణలో గురువారం జరిగిన ఘటనలపై క్రిమినల్ కేసులు పెట్టాలని మార్షల్స్ ను స్పీకర్ తమ్మినేని ఆదేశించారు. నిన్న చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలతో పాటు బయటివారు కూడా ఉన్నారన్న విషయం వీడియోల్లో స్పష్టమైందని స్పీకర్ అన్నారు. బయటివారిని గుర్తించేందుకు పోలీసుల సాయం తీసుకోవాలని సూచించారు.
నిన్నటి ఘటనలు చాలా దురదృష్టకరమైనవని అన్నారు. అసెంబ్లీ రక్షణ నిమిత్తం నియమించబడిన మార్షల్స్ తో దురుసుగా ప్రవర్తించడం సారికాదని స్పష్టం చేశారు. క్రిమినల్ కేసు పెట్టాలని తాను సభ నుంచి మార్షల్స్ కు ఆదేశాలు జారీ చేస్తున్నానని స్పీకర్ తెలిపారు.