దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.23 కోట్లు దాటింది కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా వైరస్ అందరికీ సోకుతూనే ఉంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే.. ఈ కరోనా మహమ్మారి ప్రభావం త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్పై పడనుంది. తాజాగా వాంఖడే స్టేడియంలో పనిచేసే 8 మంది గ్రౌండ్ సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఐపీఎల్ యజమాన్యం అలర్ట్ అయింది. ముంబైలో మ్యాచ్ల నిర్వహణ సాధ్యంకాకపోతే.. ఏం చేద్దాం అనే దానిపై ఐపీఎల్ యజమాన్యం ఫేకస్ పెట్టింది. ఏప్రిల్ 9 నుంచి ఈ ఏడాది సీజన్ మొదలవనుండటంతో ప్రస్తుతం కరోనా తీవ్రత తక్కువగా ఉన్న నగరాలపై దృష్టిసారించింది. వేరొక చోటకు మ్యాచ్ వేదికలను మార్చాలని భావిస్తే ప్రత్యామ్నాయంగా హైదరాబాద్, ఇండోర్లను స్టాండ్ బైగా ఎంపిక చేసింది. హైదరాబాద్లో కరోనా తీవ్రత తక్కువగానే ఉందని.. ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు అన్ని విధాలా సహకరిస్తామని మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల కిందటే బీసీసీఐని కోరిన విషయం తెలిసిందే. ఒకవేళ ముంబై నుంచి మ్యాచ్లను తరలించాల్సి వస్తే.. ఆతిథ్య మిచ్చే అవకాశం హైదరాబాద్కు దక్కే ఛాన్స్ ఉంది.
previous post
తిరుపతిని ఏపీ రాజధానిగా చేయాలి..మాజీ మంత్రి చింతా మోహన్