telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడు..

ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దేవధర్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు. “యూ-టర్న్” బాబు…మరోసారి “యూ-టర్న్” రాజకీయం చేస్తూ రామతీర్థం వెళ్తున్నారని…. దేవాలయాలపై దాడుల విషయంలో చంద్రబాబు నాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో రోడ్ విస్తరణ కోసం ఆలయాలు కూల్చారని… అప్పుడు మేము ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ నిరసన తెలిపామన్నారు. బీజేపీ ఎప్పుడూ కుటుంబ, వారసత్వ రాజకీయ పార్టీలను వ్యతిరేకిస్తోందని… ఇవన్నీ హిందూ వ్యతిరేక పార్టీలని తెలిపారు. ప్రాంతీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసం మెప్పు పొందే రాజకీయాలు చేస్తాయని…ఒక మతానికి ప్రభుత్వమే ప్రాధాన్యతనిచ్చి మత మార్పిడులను ప్రోత్సహించడం ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. ఒక మతానికి ప్రభుత్వమే వెన్నుదన్నుగా నిలవడాన్ని ఒప్పుకోమని…ఈ అంశంపై బీజేపీ రోడ్ల మీదకొచ్చి పోరాటాలు చేస్తుందని స్పష్టం చేశారు. అన్ని మతాలకు సమన్యాయం చేయడం, ఏ ఒక్క మతం విషయంలో మెప్పు పొందే రాజకీయాలు చేయకపోవడం తమ విధానమన్నారు.

Related posts