ఐపీఎల్ 2021 సీజన్ వాయిదా పడటంతో ఇప్పటికే ముంబైలోని తన ఇంటికి చేరుకున్న రహానే.. శనివారం వాక్సిన్ వేయించుకున్నాడు. ఐపీఎల్ 2021లో రహానే ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో వచ్చిన అవకాశాలను జింక్స్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పరుగులు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాడు.కేవలం తమ కోసమే కాకుండా.. చుట్టు ఉన్నవారి కోసం టీకా వేయించుకున్నామని ఇన్స్టాగ్రామ్లో అజింక్య రహానే తెలిపాడు. ‘నేను, నా సతీమణి రాధిక ధోపవ్కర్ ఈరోజు కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాం. మేము కేవలం మా కోసమే కాకుండా, మా చుట్టు ఉన్నవారి కోసం టీకా వేయించుకున్నాం. అర్హులైన ప్రతిఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాక్సిన్ తీకోవాలని కోరుతున్నాను’ అని జింక్స్ ట్వీట్ చేశాడు. రహానే భారత్ తరఫున ఇప్పటివరకు 73 టెస్టులు, 90 వన్డేలు, టీ20లు ఆడాడు. ఇక గురువారం టీమిడియా సీనియర్ ఓపెనెర్ శిఖర్ ధావన్ కూడా కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నవిషయం తెలిసిందే.