ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రసంగం ఆవేదన కలిగించిందని టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ గల్లా అరుణ అన్నారు. 71వ గణతంత్ర దినోత్సవం రోజున గవర్నర్ ప్రసంగం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. మూడు రాజధానులను గవర్నర్ సమర్దించినట్టు మాట్లాడటం చాలా బాధాకరమని అన్నారు.
5 కోట్ల ఆంధ్ర ప్రజల అభిష్టాన్ని గవర్నర్ పునరాలోచించాలని సూచించారు. గవర్నర్ ఒక పెద్ద మనిషి పాత్ర పోషించలే తప్ప ఇలాంటి ప్రసంగం చెయ్యటం దురదృష్టకరమని అరుణ వ్యాఖ్యానించారు.
యురేనియం తవ్వకాలపై ఎవరికీ అనుమతి ఇవ్వలేదు: సీఎం కేసీఆర్