telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హైదరాబాద్‌ : .. ఏసీబీ అదుపులో .. మధుసూదన్‌రెడ్డి …

ACB arrested madhusudan reddy

రాష్ట్ర అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డిపై ఫిర్యాదులు వచ్చాయని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. దర్యాప్తునకు సంబంధించి డీఎస్పీ మాట్లాడుతూ..భారీగా అక్రమాలకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో వెల్లడైంది. దీనిపై కేసు నమోదు చేసుకొని ఈ రోజు 10చోట్ల సోదాలు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, కర్నూల్‌లో సోదాలు చేస్తున్నాం. ఇప్పటి వరకు రూ.3కోట్లకు పైగా అస్తులను గుర్తించాం. ఇంటర్‌ పేపర్‌ లీకేజీలో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.

రెండు ఫ్లాట్స్‌ పత్రాలను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ చెప్పారు. హోండా సిటీ, ఇన్నోవా కారు సీజ్‌ చేశాం. బంధువుల ఇళ్లలో ఇంకా సోదాలు చేస్తున్నాం. సోదాలు పూర్తి చేసిన తర్వాత మధుసూదన్‌రెడ్డిని అరెస్ట్‌ చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. దర్యాప్తు అనంతరం ఏసీబీ అధికారులు మధుసూదన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మూసారాంబాగ్‌ ఇంటి నుంచి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి మధును తరలించారు.

Related posts