telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా కారణంగా కోలుకోలేని దెబ్బ: సీఎం జగన్

కరోనా నివారణ చర్యలపై ఐదుగురు మంత్రులతో ఏపీ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో బొత్స, మేకతోటి సుచరిత, ఆళ్ల నాని, కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ ఏర్పాటు సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కమిటీ సభ్యులు నిత్యం వైద్యశాఖ అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

కరోనా కారణంగా దేశానికి, రాష్ట్రాలకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలిందని జగన్ అన్నారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై ఖర్చుకు వెనుకాడవద్దని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారికి వసతి, భోజనం కల్పించేలా ఆయా రాష్ట్రాలతో మాట్లాడాలని సీఎం ఆదేశించారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై జిల్లాకు రూ.2 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు.

Related posts