telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

పవన్‌ కల్యాణ్‌ ఉల్లి పొట్టు కూడా తీయలేరు: విజయసాయి రెడ్డి

YCP Vijayasai Reddy Fire Chandrababu
తాట తీస్తానంటున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉల్లి పొట్టు కూడా తీయలేరని వైసీపీ  ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం ట్విటర్‌ వేదికగా చంద్రబాబు, పవన్‌లపై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. పవన్‌ ఒక అమ్ముడుపోయిన వ్యక్తని ఆరోపించారు. నాలుగు రాళ్లు సంపాదించడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడని దుయ్యబట్టారు. పవన్‌ యజమాని చంద్రబాబే అన్ని సర్ధుకుంటున్నాడని అన్నారు. 
ఇక పది రోజుల్లోనే పోలింగ్‌ ఉన్నప్పటికీ ఇంతవరకు  ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసే దమ్ము లేదు. కిందటి ఎన్నికల మేనిఫెస్టోని తన పార్టీ వెబ్సైట్లో కనిపించకుండా తీసేశారు. నిజాయితీ అన్న మాటకు వ్యతిరేకార్థం ఏదైనా ఉంటే అది చంద్రబాబే అని విమర్శించారు. ఇతర రాష్ట్రాల నాయకుల ప్రచారం ముగిసిందని, తన సభలకు  జనాలు రావడం లేదని, దర్శకుడు రాఘవేంద్రరావు ద్వారా సినీ హీరోలు, కథానాయికలను రప్పించడానికి చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు.

Related posts