telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రోడ్డు యాక్సిడెంట్ కేసులో కుమారుడు.. వైసీపీ ఎమ్మెల్యే వివరణ

ycp ap

సైబర్ టవర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం పై స్పందించారు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి.రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డి పేరు తెర పైకి రావడంతో వివరణ ఇచ్చారు ఎమ్మెల్యే రామిరెడ్డి. నాలుగు రోజుల క్రితం కారు రిపేర్ కోసం గ్యారేజ్ లో ఇచ్చామని..గురువారం ఉదయం మా దగ్గరికి కారు రావాల్సి ఉంది కానీ నా కొడుకు స్నేహితుడు కౌశిక్ గ్యారేజ్ నుండి కారు ను తీసుకున్నాడని పేర్కొన్నారు.కారు ను కౌశిక్ తీసుకువచ్చి ఇస్తాడాని భవించామని…కానీ కౌశిక్ మరో స్నేహితుడు తో కలిసి పబ్ కు వెళ్ళాడని తెలిపాడు. తిరిగి వచ్చే సమయంలో రోడ్డు ప్రమాదం చేశారని..అనవసరంగా ఓబుల్ రెడ్డి పేరు ను వివాదం చేయాలని చూస్తున్నారని ఫైర్‌ అయ్యారు.పబ్ లో కానీ ప్రమాదం జరిగిన ప్రాంతంలో కానీ ఓబుల్ రెడ్డి ఉన్నట్టు తెలిస్తే చర్యలు తీసుకోవచ్చని..సంబంధం లేని అంశంలో ఓబుల్ రెడ్డి పేరు ను ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రమాదం జరిగిన రోజు ఓబుల్ రెడ్డి బనగానపల్లె లో పాదయాత్ర లో పాల్గొన్నాడని..కేసు తారుమారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న ఆరోపణలు అవాస్తవమన్నారు.

Related posts