ఏపీ సీఎం జగన్ మరోసారి కొత్త జిల్లాల అంశాన్ని ప్రస్తావించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జగన్ మాట్లాడుతూ… ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే ఆలోచన ఉందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 12 జిల్లాలు ఏర్పడబోతున్నాయని ఈ అంశంపైజగన్ ఈరోజు స్పష్టతనిచ్చారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త జిల్లాలపై దృష్టిని సారించింది.
కొత్త జిల్లాల ఏర్పాటుపై గతంలోనే అధికారులతో జగన్ చర్చించిన దాఖలాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి నుంచి దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని అందరూ భావించారు. కొన్ని కారణాల వల్ల ప్రభుత్వం దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకోలేకపోయింది. తాజాగా కొత్త జిల్లాల అంశాన్ని జగన్ మరోసారి ప్రస్తావించడంతో ఈ అంశంపై ఆయన చాలా సీరియస్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అక్రమ సంపాదన కోసం కేసీఆర్ అడ్డదారులు: బండి సంజయ్