తాజాగా ఇన్స్టా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తన డైట్కు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. తనడైట్లో కూరగాయాలు, గుడ్లు, కాఫీ, పప్పు, పాలకూర, దోషాలు ఉంటాయన్నాడు. అయితే వీటన్నిటిని కంట్రోల్గా తీసుకుంటానని తెలిపాడు. ఇక గుడ్లు తింటానని చెప్పడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మాంసం తినడం లేదని, పూర్తిగా వెజిటేరియన్ అని గతంలో చెప్పిన కోహ్లీ ఇప్పుడేలా తింటున్నాడని ప్రశ్నిస్తున్నారు. గతేడాది క్వారంటైన్ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్తో ఇన్స్టా వేదికగా లైవ్ సెషన్లో పాల్గొన్న విరాట్.. తన అనారోగ్య సమస్యల కారణంగా శాఖహారిగా మారినట్లు తెలిపాడు. అయితే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు కోహ్లీపై విమర్శలు గుప్పిస్తున్నారు. శాఖాహారి అని చెప్పి కోహ్లీ గుడ్లు తింటున్నాడని ఒకరంటే.. గుడ్లు నాన్వెజ్ కాదనుకుంటా.. అని మరొకరు కామెంట్ చేశారు. కోహ్లీ కూడా మనలానే మాట తప్పాడని మరొకరు సెటైర్ పేల్చాడు. వెజిటేరియన్ అని చెప్పిన కోహ్లీ ఏంచక్కా గుడ్లు తింటున్నాడని, గుడ్లు తిన్నాక వెజిటేరియన్ ఎలా అవుతాడని మరొకరు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ చర్చ సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తోంది.
next post