తెలంగాణ నుంచి ఏపీకి రావాలనుకుంటే 14 రోజులు క్వారంటైన్లో ఉండడానికి ఒప్పకోండని ఏపీ మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై ఈ రోజు ఆయన అమరావతిలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశా ముఖ్యమంత్రులతో ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. ఏపీ ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించాలని కోరారు’ అని పేర్నినాని తెలిపారు. ‘వందల సంఖ్యలో ఏపీ సరిహద్దులకి చేరుకుంటోన్న ఏపీ ప్రజలకు ఇదే చెబుతున్నాం.. 14 రోజుల క్వారంటైన్కు సిద్ధపడి వస్తేనే అనుమతిస్తామని స్పష్టం చేశారు.
కరోనా నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 52 వేల ఎన్-95 మాస్కులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. తెలంగాణలోని ప్రతి జిల్లా కేంద్రంలో 200, నియోజక వర్గంలో 100 ఐసోలేషన్ పడకలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఏపీలో 400 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఏపీ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ అచేతన స్థితిని అర్థం చేసుకోవాలని కోరారు.
మూడు రాజధానులపై బొత్స ఆసక్తికరవ్యాఖ్యలు..