ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీసులో జరిగే భేటీ కోసం నిర్మాతలు కొందరు స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడకు బయలుదేరారు.
సినిమా నిర్మాతల సమస్యలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది.
చలసాని అశ్వినీ దత్, అల్లు అరవింద్, ఎర్నేని నవీన్, దగ్గుబాటి సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ యార్లగడ్డ, కనుమూరి రఘురామకృష్ణంరాజు (ఉండి ఎమ్మెల్యే) మరియు ఇతర నిర్మాతలు విజయవాడకి ప్రయాణం అయ్యారు.
పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు తొలిసారి భేటి కానున్నారు.