telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇక ఆ రాష్ట్రంలో కూడా వీకెండ్ లాక్‌డౌన్…

ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల తీవ్ర‌త‌ను బ‌ట్టి కొన్ని రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తుంటే.. మ‌రికొన్ని రాష్ట్రాలు.. నైట్ క‌ర్ఫ్యూ విధిస్తున్నారు..  తాజాగా మ‌రో రాష్ట్రం ఈ జాబితాలో చేరింది.. ఉత్తర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సైతం క‌రోనా క‌ట్ట‌డి కోసం క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేసేందుకు సిద్ధ‌మైంది. ఈ మేర‌కు ఈ వారం నుంచి క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం త‌గ్గేవ‌ర‌కు ప్ర‌తి వారం శ‌ని, ఆదివారాల్లో వీకెండ్ లాక్‌డౌన్ విధించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం యోగి ఆదిత్య‌నాథ్. అయితే, ఇది కేవ‌లం ప‌ట్ట‌ణాల‌కే మాత్రం గ్రామ స్థాయి వ‌ర‌కు ఈ నిబంధ‌న‌లు కొన‌సాగ‌నున్నాయి.. 500కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదైన ప్ర‌తీ గ్రామంలో క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయి.. ఇక‌, వీకెండ్ లాక్‌డౌన్.. శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కు ఈ లాక్‌డౌన్ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది ప్ర‌భుత్వం.. లాక్‌డౌన్ స‌మ‌యంలో కేవ‌లం అత్యావ‌స‌ర‌, నిత్యావ‌స‌ర సేవ‌ల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని పేర్కొంది స‌ర్కార్.

Related posts