telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

నిలిచిపోయిన విమానం.. ప్రయాణికుల ఆందోళన

Flight

హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో స్పైస్‌జెట్‌ విమానం నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నంకు బయలుదేరాల్సి ఉంది. ముందస్తు సమాచారం లేకుండా విమానం నిలిచిపోవడంతో 80 మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోఇబ్బద్నులుపడుతున్నారు. స్పైస్‌జెట్‌ సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. సాంకేతికలోపంతో విమానం ఆగిందని అధికారులు చెబుతున్నారు. విశాఖలో జరిగే ఆర్‌బీఐ పరీక్షకు హాజరు కావాల్సి ఉందని పరీక్షకు ఆలస్యమవుతోందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

Related posts