సీఎం జగన్ చెబుతున్న గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. గుంటూరు జిల్లాలోని తెనాలిలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా సాధ్యం కాదని కేంద్రం చెప్పిందనీ, అయినా సీఎం జగన్ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె విమర్శించారు.
ప్రత్యేకహోదా విషయంలో ముఖ్యమంత్రి జగన్ వైఖరి సరికాదని వ్యాఖ్యానించారు. రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇసుక విధానంపై కూడా ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని చాలామంది ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరుతున్నారనీ అన్నారు.