telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జగన్ రెడ్డి ప్రభుత్వ తీరు నిందుతులకు రాజమార్గం పట్టేలా ఉంది…

achennayudu tdp

టీడీపీ ఎమ్మెల్యీ బీటెక్‌ రవిని చైన్నైలో ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.. అయితే.. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్రంగా అరెస్టును ఖండిస్తున్నామని… నెల రోజుల క్రితం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళను అత్యాచారం చేసి కిరాతకంగా చంపారని తెలిపారు. నిందితులను అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అడిగిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని ఫైర్‌ అయ్యారు. అంతర్జాతీయ దొంగలకు బెయిలిచ్చి రోడ్ల మీద తిప్పుతున్నారని…. ప్రజల కోసం పోరాటం చేసిన వారిని జైళ్లో పెడతారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస సంస్కృతి ఎగిసి పడుతోందని… తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు అచ్చెన్నాయుడు. జగన్ రెడ్డి ప్రభుత్వ తీరు నిందుతులకు రాజమార్గం పట్టేలా ఉందని… దేశంలో ఎక్కడాలేనంతగా అట్రాసిటీని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. చేతనైతే నిందితులకు శిక్ష వేసి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు.

Related posts