telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేరళ ప్రభుత్వాన్ని ప్రశంసించిన మోడీ…

one nation one day salary slogan by modi

వ్యాక్సిన్ వృధా కాకుండా తగ్గించినందుకు కేరళ ప్రభుత్వాన్ని ప్రధాని మోదీ అభినందించారు. కోవిడ్ పై పోరులో ఇలాగే అన్ని రాష్టాలూ సహకరించాలన్నారు. కేరళ రాష్ట్ర నర్సులు, హెల్త్ కేర్ వర్కర్లు వ్యాక్సిన్ వేస్టేజీని తగ్గించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. తమ రాష్ట్రంలో వ్యాక్సిన్ వృథాకు సంబంధించి డేటాను విజయన్ ప్రధానంగా ప్రస్తావించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి 73,38,806 డోసుల వ్యాక్సిన్ అందిందని, తాము 74,26,164 డోసులను అందజేశామని ఆయన పేర్కొన్నారు. అదనంగా లభ్యమైన డోసులను కూడా మా నర్సులు, హెల్త్ కేర్ వర్కర్లు వినియోగించారని ఆయన వెల్లడించారు. ఇందుకు వారిని ఎంతగానో మోడీ అభినందించారు. ఇక ప్రస్తుతం మన దేశంలో మూడు లక్ష్యాలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.

Related posts