telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

గ్యాంగ్ స్టర్ నయీం కేసు కీలక మలుపు!

nayeem gangstar

గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ లో హతమైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన తెలంగాణలో సంచలనం రేపింది. ఎన్ కౌంటర్ లో నయీం హతమై చాలా కాలమైంది. ఎప్పటికప్పుడు ఈ కేసులో ఏదో ఒక కొత్త విషయం తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా నయీంతో పోలీస్, రెవెన్యూ అధికారులు దిగిన ఫోటోలను లోక్ పాల్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమర్పించనుంది.

ఆర్టీఐ చట్టం కింద ఈ సమాచారాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సేకరించింది. నయీంతో కలిసి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని, వారి పాత్రపై విచారణ జరపాలని లోక్ పాల్ ను కోరనుంది. ఈ నేపథ్యంలో నయీం కేసులో పలువురి జాతకాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Related posts