కొంత కాలంగా ప్రముఖుల సోషల్ మీడియా ఎకౌంట్స్ హ్యాక్ కు గురవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ఎకౌంట్ హ్యాకింగ్కి గురైంది. పాకిస్థాన్కి చెందిన టర్కిష్ హ్యాక్ గ్రూప్ ఈ పని చేసినట్టు తెలుస్తుంది. అమితాబ్ ఎకౌంట్ని హ్యాక్ చేసిన వారు అమితాబ్ ప్రొఫైల్ పొటో స్థానంలో పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్ఖాన్ ఫొటోను ఉంచారు.
అలాగే అమితాబ్ బయోడేటాను కూడా మార్చివేశారు. దానిపై లవ్ పాకిస్తాన్ అని రాశారు. అంతేకాదు పోస్ట్లలో ఇండియాకి వ్యతిరేఖంగా కొన్ని కామెంట్స్ కూడా రాసారు. మరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే అమితాబ్ తన ఎకౌంట్ హ్యాక్ అయిన విషయంపై ఇంకా స్పందించకపోవడం గమనార్హం.